భార్య దురుసుగా సమాధానం చెప్పిందని భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. విజయనగరం జిల్లా గుర్ల మండలం అచ్యుతాపురం గ్రామంలో డేనియల్ అనే వ్యక్తి తన భార్య సంతోషితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే సోమవారం డేనియల్ భార్య సంతోషి అపరిచిత వ్యక్తితో ఫోన్లో మాట్లాడిందని మందలించిన నేపథ్యంలో భార్య సంతోషి డేనియల్ కు దురుసుగా సమాధానం చెప్పడంతో డేనియల్ తన స్వగ్రామమైన మెంటాడ మండలం జక్కువ గ్రామానికి చేరుకొని అధిక మోతాదులో పారాసెట్మాల్ మాత్రలను నీటిలో కలిపి త్రాగాడు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు డేనియల్ ను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి చికిచ్చ నిమిత్తం 108 వాహనంలో తరలించారు. డేనియల్ సివిల్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. ఈ మేరకు అవుట్ పోస్ట్ పోలీసులు డేనియల్ నుండి వాంగ్మూలాన్ని సేకరించారు.