ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 04:52 PM

విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స. సత్యనారాయణ అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులు మరియు జిల్లా ఎమ్మెల్యేలతో సోమవారం ధాన్యం కొనుగోలు అంశంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. రైతు పండించే ప్రతి ధాన్యపు గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, విజయనగరం ఎంపీ బెల్లాన. చంద్ర శేఖర్ (పెదబాబు), జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావు (చిన్నశ్రీను), జిల్లాలో ఇతర నియోజకవర్గ శాసనసభ్యులు బొత్స. అప్పలనరసయ్య, పీడిక రాజన్న దొర, బడ్డుకొండ అప్పలనాయుడు శంబంగి. చిన వెంకట ఆప్పలనాయుడు, డిసిసిబి చైర్మన్ వేచలపు వెంకటచిన రామునాయుడు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు కొండపల్లి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com