ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 04:50 PM

కడుపునొప్పి తాళలేక ఓ వ్యక్తి కత్తితో మెడపై గాయపరచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శృంగవరపుకోట నియోజకవర్గంలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం. శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలం యం. కొత్తవలస గ్రామంలో మీరా సాహెబ్ అనే వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజుల నుండి మీరా సాహెబ్ భరించలేని కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. సోమవారం ఆయన విపరీతమైన కడుపునొప్పి తాళలేక కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉంటే మీరా సాహెబ్ విజయనగరం స్థానిక వై. జంక్షన్లో గల మాంసం దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ మేరకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు మీరా సాహెబ్ బంధువుల నుండి సేకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com