ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 22న డివిజ‌న్ స్థాయి డాక్ అదాల‌త్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 04:48 PM

పోస్ట‌ల్ వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దృష్ట్యా ఈ నెల 22వ తేదీన డివిజ‌న్ స్థాయి డాక్ అదాల‌త్‌, ఫించ‌న్ అదాల‌త్ లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు డివిజ‌న‌ల్‌ పోస్ట‌ల్ సూప‌రింటెండెంట్ ఎ. ఈశ్వ‌ర‌రావు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు కార్యాల‌యంలో ఆ రోజు సాయంత్రం 4. 00 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. వినియోగ‌దారులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అదాల‌త్ లు నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు ప్ర‌జ‌ల నుంచి విన‌తులు, విజ్ఞ‌ప్తులు స్వీక‌రిస్తామ‌ని పేర్కొన్నారు. గ‌డువు త‌ర్వాత వ‌చ్చే విన‌తులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌టం అవ్వ‌ద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com