అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జీ కుటుంబంపై అనుచితంగా మాట్లాడినఅస్సాంముఖ్యమంత్రి హేమంత్ బిస్తా శర్మ ను తక్షణo ముఖ్యమంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వర రావు , పిసిసి సెక్రటరీ ఆకుల వెంకటరమణ అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్పనా సెంటర్లోధర్నా నిర్వహించారు. కల్పనా సెంటర్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. తక్షణమే నరేంద్రమోడీకి ఏమాత్రం సిగ్గూ శరం వున్నా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబాన్ని అవమానపరిచిన అస్సాం ముఖ్యమంత్రిని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు, ఆకుల వెంకటరమణ, చెక్కా నూకరాజు, బుర్ర పద్మనాభం, కంభం రాజబాబు, ఐఎన్ టియుసి సిటీ, రూరల్ అధ్యక్షుడు తాళ్లూరి రాజు, మోహిద్దీన్, పిట్టా అర్జున్, ఫణికుమార్, వనుము వెంకటరమణ, ముంజవరపు మాణిక్యాలరావు, భావిశెట్టి సత్యనారాయణ, కడియాల శ్రీనివాస్, నవుడు గోవిందు, బలగం పరమేశ్, జుత్తిగ సత్తిబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు