సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. మంగళవారం రాజమండ్రి రూరల్ టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, లక్షల కోట్లు అప్పు తెచ్చి పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలన రాష్ట్రానికి పట్టిన గ్రహణంగా చెప్పుకొచ్చారు.