తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం గంజాయి అక్రమ రవాణా పై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్న గంజాయి స్మగ్లర్లు పోలీసులు కల్లు గప్పి అక్రమ రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో చింతూరు సర్కల్ ఇన్సెక్టర్ యువకుమార్ ఆధ్వర్యంలో మోతుగూడెం సభ్ ఇన్స్పెక్టర్ వాసంశెట్టి సత్తిబాబు తన సిబ్బందితో స్టేషను ముందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఇన్నోవా వాహనంలో 230 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు.
ఒక నిందితుడిని అదుపులోకి తీసుకోగా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ గంజాయిని సింధువాడ నుండి తెలంగాణాలోని హైదరాబాద్ తరలిస్తుంన్నారు. దీని విలువ సుమారు ఎనిమిది లక్షల వరకు ఉంటుందని వాహనాన్ని సీజ్ చేసి ఒక నిందుతుడిని అదుపులోకి తీసుకున్నామని సభ ఇన్స్పెక్టర్ సత్తిబాబు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో యం. ఆర్. ఓ కరకాసత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ దైవకని, ఎఎస్ఐ పట్టాభిరామయ్య, హెడ్ కానిస్టేబుల్, నాగేశ్వరరావు, సోమరాజు, ప్రసాద్, రాజు, వాసు మరియు సిఆర్పియఫ్ సిబ్బంది పాల్గొన్నారు.