సమాజంలో రోజురోజుకూ బంధాలు కనుమరుగవుతున్నాయి. లైంగిక సంబంధాలు పెట్టుకునే క్రమంలో కొందరు వావీ వరుసలు మర్చిపోతున్నారు. తాజాగా జరిగిన ఘటన అదే కోవలోకి వస్తుంది. భర్త చనిపోయిన వివాహితపై ఓ వ్యక్తి మనసు పడ్డాడు. పెళ్లి చేసుకున్నాక ఆమె కూతురిపైనా కన్నేశాడు. లొంగదీసుకుని, చివరికి ఆమెను తీసుకుని ఎటో పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని విజయనగరం ప్రాంతానికి చెందిన నక్కాక లక్ష్మికి 14 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆమెకు 17 ఏళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం ఆమె క్యాటరింగ్ పనులకు వెళ్తుండేది. ఈ క్రమంలో ఓ సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆమెను సురేష్ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అంగీకరించింది. కొంతకాలం తర్వాత మహిళ కుమార్తెపై అతను కన్ను పడింది. ఆమెకు చాలా ఆశలు చూపించాడు. డబ్బు ఇవ్వడంతో పాటు ఆమెకు కావాల్సినవన్నీ కొనిచ్చేవాడు. తొలుత లొంగకపోయినా కొంతకాలానికి అతడి మాయమాటల వలలో పడింది. అదే అదునుగా ఆమెతో తండ్రినని మరిచి, సంబంధం నెరిపాడు. శుక్రవారం ఆమెను తిరుపతి దర్శనానికి తీసుకెళ్తున్నాని ఆమె తల్లికి చెప్పాడు. తీరా అక్కడకు వెళ్లాక బాలికను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి షాకిచ్చాడు. కొద్దిసేపటికే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో బాలిక తల్లి లబోదిబోమంటూ విజయనగరం వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.