తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం మండలం ఐ పోలవరం గ్రామ సమీపంలోని సీత పల్లి వాగులో స్నానానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన నామాల మణికంఠ 21 తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామ సమీపంలోని సీతపల్లి వద్దకు రావడం జరిగిందని సాయంత్రం సమయంలో స్నానం చేసేందుకు వాగులో దిగి మణికంఠ గల్లంతయ్యారు.
అతని స్నేహితులు వెంటనే సమాచారం ఇవ్వడంతో రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ త్రినాథ్ , సబ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ , ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ త్రినాథ్ తెలిపారు.