విజయనగరంలోని తోటపాలెం సమీపంలో బీజీ నగర్లో నివాసం ఉంటున్న బీ-టెక్ విద్యార్థిని తన గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనాడులో వచ్చిన కథనం ప్రకారం.. తండ్రి సూర్యనారాయణ మైలాన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల ఆయనకు ప్రమాదం జరగడంతో ఇంట్లోనే ఉంటున్నారు. తల్లి ఊరు వెళ్లారు. చదువుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లిన యువతి బయటకు రాకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకొని ఉంది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేంద్ర ఆసుపత్రికి తరలించారు.