తూర్పు గోదావరి: కొత్తపేట గోగివారిపేటకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితి లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం స్థానిక గోగివారి పేట కు చెందిన గుమ్మడి వెంకట శేఖర్( 20)బుధవారం ఆకస్మికంగా మృతి చెందాడు. ఇతనిది సాధారణ మరణం కాదని ఎవరో చంపేసి ఆత్మహత్య గా చిత్రీకరిస్తు న్నారని స్థానికుల ఆరోపణ. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు, పురుగుల మందు సేవించి ఉంటాడని మరికొందరు చర్చించు కుంటున్నారు. ఇతని మరణం వెనుక ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. పోలీసులకు అందిన పిర్యాదు మేరకు తహశీల్దార్ జి. డి. కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఎస్సై మణి కుమార్ సిబ్బంది తో కలిసి శుక్రవారం స్మశానవాటికలో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించ నున్నారు. పోలీసు అధికారుల విచారణ లో మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.