ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచవద్దని, గ్రూప్ 1, 2 నూతన నోటిఫికేషన్ ఇవ్వాలన్ని, ఏపీపీఎస్సీ నెగటివ్ మార్కులు రద్దు చేయాలని, ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు పరీక్ష తేదీలను పంపించాలని ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పిడిఎస్ యు తెలుగు యువత ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నిరుద్యోగులకు ప్రతి ఏడాది జాబ్ కార్డు ను ప్రకటిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు.