విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. సముద్రంలో పడి అలల ఉధృతికి మత్స్యకారుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం బర్రిపేటకు చెందిన సునపతి రాముడు(40) అనే మత్స్యకారుడు సోమవారం ఉదయం కోనాడ మీదుగా సముద్రం వెంబడి భోగాపురం మండలం చోడిప ల్లిపేట గ్రామానికి బంధువుల ఇంటికి బయలుదేరి వెళ్లాడు.
అయితే కోనాడకు, చోడిపల్లిపేటకు మధ్యలో చంపావతి నది, సముద్రం కలిసే ప్రాంతంలో కాస్త తక్కువగా నీరు ఉండడంతో నీటిలో దిగి, వస్తుండగా కెరటాలు ఉధృతంగా రావడంతో లోపలికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం చోడిపల్లిపేట గ్రామ సమీప సముద్ర తీరానికి మృతదేహం కొట్టుకువచ్చింది. మృతుడికి భార్య పైడమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మద్య తగాదారావడంతో గత నాలుగు సంవత్స రాలుగా భార్య, పిల్లలు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేటలో ఉంటున్నారు. మృతుడు బర్రిపేటలో ఉంటున్నాడు. మృతుడి బావ రామదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మహేష్ తెలిపారు.