తూర్పు గోదావరి జిల్లా, జగ్గంపేట మండలం జై కొత్తూరు గ్రామ శివారులో యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు. రాజపూడి గ్రామానికి చెందిన నేదునూరి వీర వెంకట సత్యనారాయణ రాజపూడి గ్రామంలో పంతం శీను ఇటుక బట్టీలు తల్లిదండ్రులతో పాటు పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి బయటికి వెళ్లి వచ్చిన అతడు తన గదిలో పడుకున్నాడు అని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే మంగళవారం ఉదయానికి అతడు ఇటుక బట్టి వద్ద చెట్టుకు వేలాడుతూ ఉన్నాడు. అతని చేతులు వెనక్కి కట్టేసి ఉండటం వలన అది హత్య ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉందని ఇన్చార్జ్ ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు అని పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత హత్య ఆత్మహత్య అన్న విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.