ఈ-క్రాఫ్ పేరిట ధాన్యం కొనుగోలు నిలుపదల చేయడం దారుణమని టిడిపి విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. డెంకాడ మండల కేంద్రంలో మంగళవారం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధలారులకు అతి తక్కువ ధరలకు అమ్మవలసిన పరిస్థితి నెలకొందని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకూ డబ్బులు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో టిడిపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్సి మహంతి చిన్నం నాయుడు, డెంకాడ మండలం మాజీ ఎంపీపీ కంది చంద్ర శేఖర్ రావు, పతివాడ అప్పలనారాయణ, చైర్మన్ పతివాడ తమ్మినాయుడు, పల్లె భాస్కర్ రావు పాల్గొన్నారు.