విశ్వబ్రాహ్మణ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ తోలేటి శ్రీకాంత్ అన్నారు. సోమవారం రాత్రి విజయనగరం బొండాడవీధిలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జనా ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని ఆయన్ని కోరారు. శ్రీకాంత్ మాట్లాడుతూ కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న విశ్వబ్రాహ్మణుల సమస్యను సిఎం దృష్టి కి తీసుకెళతానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ముగడ వెంకట రమణ, గౌరవ అధ్యక్షులు కుప్పిలి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ తమిరి శ్రీను, స్వర్ణకారుల సంఘం ప్రధాన కార్యదర్శి పెదగాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.