సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ అన్నారు. పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో సోమవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఓటిపి, జాబ్ ఫ్రాడ్స్, కేవైసి పేరిటి వచ్చే లింకులు, ఈ-మెయిల్స్, మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటిని గురించి పూర్తిగా తెలియకుండా క్లిక్ చేయవద్దని, అవగాహనతోనే సైబరు నేరాలను నియంత్రించ వచ్చునన్నారు. సైబరు నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లను, కర పత్రాలను జిల్లా ఎస్పీ ఆవిష్కరించి, మహిళా పోలీసులకు, ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో భోగాపురం సిఐ కేకేవి విజయనాధ్, ఎస్ఐలు జయంతి, పద్మావతి, మహేష్, ప్రశాంత్ కుమార్, నర్సింగరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.