విజయనగరం పట్టణానికి చెందిన ఎ. ఆర్ కానిస్టేబుల్ షేక్ అహ్మద్ బాషా(31) అప్పుల భాద తాళలేక పట్టణానికి సమీపంలో ఉన్న గోకపేట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారుఝామున తన తండ్రికి ఫోన్ చేసి చనిపోతున్నానంటూ చెప్పి చెరువులోకి దూకేశాడు. మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు.