మరణించిన ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని జిల్లా ఆశా వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో తూ.గో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ కు ఆశా వర్కర్ల అనుమతి ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఆశావర్కర్లు జిల్లా కలెక్టరేట్ వైపుకు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆశావర్కర్లు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాకినాడ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఆశా వర్కర్లు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.