తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం మండలం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ…ఆశా వర్కర్ల ఈ రోజు ఆర్డీవో ఆఫీసు వద్ద సోమవారం 12 గంటల సమయంలో ముట్టడించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమానికి సోమవారం ఆశా వర్కర్స్ యూనియన్ ( సి ఐ టి యు) పిలుపు ఇవ్వడం జరిగింది. కాకినాడ వెళ్తున్న ఆశా వర్కర్లను జిల్లా అంతటా ఎక్కడి కక్కడ పోలీసులు ఆపేయడం జరిగింది.
నడిపించే నాయకత్వాన్ని ముందస్తు అరెస్టులు చేసారు. అమలాపురం ప్రాంతం నుండి వెళ్తున్నవారిని వెళ్లకుండా ఆపేయడంతో అమలాపురంలో ఈ రోజు సోమవారం 12 గంటల సమయంలో ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని తమ డిమాండులతో కూడిన నిరసనలతో ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తపరిచారు. ఆశావర్కర్ల డిమాండ్ను తక్షణం పరిష్కారం చేయాలని తమ ప్రాణాలు పణంగా పెట్టి కోవిడ్ లో ప్రజలందరికీ వైద్య సేవలు అందించిన ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆశ వర్కర్ల డివిజన్ నాయకురాలు బి ఎస్తేరురాణి గళం విప్పారు. ప్రభుత్వాన్ని దుయ్యబట్టేందుకే పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తునారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ వసంత్ కుమార్, మద్దతు తెలియజేశారు.