తూర్పు గోదావరి: రాజోలు మండలంలోని మంచు విపరీతంగా పట్టడంతో రహదారులు కనిపించక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా ప్రభావంతో మార్కెట్ ఉదయం ఆరు గంటలకే పెట్టడంతో మార్కెట్ కి వెళ్లి వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడ్డామని తెలుపుతున్నారు. అలాగే స్కూల్ బస్సులు కూడా రహదారులు కనిపించకపోవడంతో ఎక్కడి బస్సులు అక్కడే ఆపి నిలిపివేశారు.