ప్రకాశం జిల్లా గిద్దలూరు మీదుగా గుంటూరు గుంతకల్లు మధ్య నడిచే పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల ఆరో తేదీ నుండి పదవ తేదీ వరకు మార్కాపుర, గిద్దలూరు మీదుగా గుంటూరు గుంతకల్లు మార్గంలో ప్రయాణించే కాచిగూడ, గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.