విజయనగరం జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజినీరు కిడ్నప్ ఘటన శుక్రవారం కలకలం రేపింది. తెర్లాం మండలం కూనయివలస గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీరు టి. ఈశ్వర రావు శుక్రవారం మార్నింగ్ వాక్ కు వెళ్తుండగా ఎస్. కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈశ్వర రావును కిడ్నప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంభ సభ్యులు తెర్లాం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఎస్. కోట వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్ కోట పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు.