విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని పెదమేరంగి సచివాలయం పరిధిలో పని చేస్తున్న ఐదుగురు వలంటీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు పంచాయతీ కార్యదర్శి పల్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. వలంటీర్లు విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఇద్దరికి, గ్రామంలో లేనందున ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు సమయానికి చేరవేయడంలో అలసత్వం వహిస్తున్నందున వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. వారిచ్చే వివరణ బట్టి చర్యలు ఉంటాయని అన్నారు.