తూర్పు గోదావరి: భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తికి దేశంలో నివసించే అర్హత లేదని దళిత సంఘాలు పేర్కొన్నాయి. రాజ్యాంగాన్ని అవమాన పర్చిన కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలపై శుక్రవారం మామిడికుదురు మండలం నగరంలో దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగం రావాలని, రాజ్యంగాన్ని హేళనగా చేయడం నీచమైన చర్య అన్నారు