ద్విచక్ర వాహనాన్ని లారీ డికొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. చోడవరం వెంకన్నపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మజ్జిజానీ (24)అనే యువకుడు మృతిచెందాడు. మండలంలోని అంభేరుపురం గ్రామానికి చెందినజానీ పరవాడ సమీపంలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి గురువారం డ్యూటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చోడవరం-అనకాపల్లి రోడ్డులో వెంకన్నపాలెం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన జానీ అక్కడికక్కడే మృతిచెందాడు.మృతునికి తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. ఇంకా వివాహంకాలేదు. మృతదేహానికి చోడవరంలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విభూషణరావు తెలిపారు.