నేటి చలో విజయవాడకు ఉద్యోగ నేతలు రాకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వం కట్టడి చేశారు. చలో విజయవాడకు అనుమతి లేదని, అందులో పాల్గొనేందుకు వెళ్తే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులను హెచ్చరిస్తూ నోటీసులిచ్చింది. విజయవాడకు దారితీసే అన్ని మార్గాలనూ దిగ్బంధించింది. ఛలో విజయవాడ భాగంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన సుమారు 200 మంది ఉద్యోగులను ఆరెస్టు చేసి అజీత్ సింగ్ నగర్ పోలీసు స్టేషన్ కి తరలించారు. స్టేషన్ వద్ద హంగర్ స్ట్రైక్ చేసేందుకు ఉద్యోగులు సిద్ధపడ్డారు.