విజయనగరం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీ సంధిగూడ గ్రామ సమీపాన చెట్టుకు వేలాడుతూ ఉరి వేసుకొని మండంగి సంధ్యారాణి మృతి చెందింది. మృతురాలు శ్రీకాకుళం జిల్లా, గొయిది గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె బిఎ, బిఇడి చదువుతున్నట్టు బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యప్తు చేస్తున్నారు. ఆత్మహత్య లేక హత్య అనేది విచారణలో తేలనుంది.