విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. శృంగవరపుకోట పట్టణానికి చెందిన ఈస్టుకోస్టు రైల్వే మెన్స్ కాంగ్రెస్ అరకు బ్రాంచి కార్యదర్శి చిదుకుల శ్రీనివాసరావు (47) మంగళవారం మృతి చెందారు. ఎస్.కోట సెక్షన్ పరిధిలో ట్రాక్ మెయింటెనెన్స్ పర్యవేక్షకునిగా పని చేస్తున్న ఈయన మృతి పట్ల రైల్వే యూనియన్ నాయకులు, సభ్యులు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.