శ్రీకాకుళం: స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులను అందజేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాంఅందచేశారు. మంగళవారం స్పీకర్ కార్యాలయం లో జరిగిన పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామానికి చెందిన సీపాన వెంకటలక్ష్మి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె కు చికిత్స నిమిత్తం రెండు లక్షల రూపాయల చెక్కును అదేవిధంగా సరుబుజ్జిలి మండలం బురిడివలస గ్రామానికి చెందిన సురవరపు ప్రభావతి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూన్న ఆమె కు చికిత్స నిమిత్తం 50 వేల రూపాయల చెక్కును స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గోకర్ణపల్లి సర్పంచ్ చింతాడ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.