ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ బియ్యం కోసం గిరిజన వృద్ధుడు అవస్థలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 02:29 PM

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని గిరిజనులు రేషన్ బియ్యం కోసం అవస్థలు పడుతున్నారు. సోమవారం సాలూరు ఏజెన్సీ ప్రాంతమైన శిరివర నుండి 13కిలోమీటర్ల దూరంలో ఉన్న దుగ్గేరు గ్రామంలోని జి. జి. సి. డీ. ఆర్ డిపో వద్దకు చేరుకోవడానికి సరైన రోడ్డు సదుపాయం లేదు. దింతో ఒక గిరిజన వృద్దుడు నడవలేని పరిస్థితి ఏర్పడింది. సీదరపు మసి (60)ఏళ్ళు నిండిన వృద్ధుని గ్రామ యువకులు డోలిపై తీసుకువచ్చి బయోమెట్రిక్ బియ్యాన్ని తీసుకున్నారు. ఏళ్ళు గడిచిన గాని అధికారులు లో స్వందనలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానిక గిరిజనులు ప్రభుత్వాన్ని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com