విజయనగరం: ఓటిఎస్ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పి బాలాజీ ప్రసాద్ కోరారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి 12వ వార్డులో పరిధిలోని ఇళ్ల లబ్ధిదారులకు ఓటిఎస్ పథకంపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటిఎస్ పథకానికి రూ. 15వేలు చెల్లిస్తే ఆ ఇంటిపై సర్వహక్కులు సంక్రమిస్తాయన్నారు. ఇంటిపై బ్యాంకు రుణం తీసుకోవడంతో పాటు, ఇంటిని వేరే వ్యక్తులకు బదలాయించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, మెప్మా సిఎంఎం దన్నాన గోవిందరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.