విజయనగరం జిల్లా కుమరాం వెలమ చెరువులోప్రమాదవశాత్తు జారిపడి ఎస్. ఎల్లయ్య(40) మృతి చెందాడు.ఈనాడు కథనం ప్రకారం..కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే ఎల్లయ్య ఆదివారం బహిర్భూమికి చెరువు వద్దకు వెళ్లాడు. కాలు జారి నీటిలో పడి మునిగిపోయాడు.ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతికారు.
సోమవారం చెరువులో విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.