ట్రెండింగ్
Epaper    English    தமிழ்

200 అడుగులు వెనక్కు వెళ్లిన సముద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 02:22 PM

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం తీరంలో సముద్రం 200 అడుగులు వెనక్కు వెళ్లింది. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం వెనక్కు వెళ్లిన ప్రాంతంలో పెద్దపెద్ద బండరాళ్లు కనిపించాయి. ఈ రాళ్ల మధ్య కొన్ని పడవలు ఉండిపోయాయి. అవి రాళ్లు తగిలి స్వల్పంగా దెబ్బతిన్నాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు. అమావాస్య, పౌర్ణమి, తుఫాన్ల సమయాల్లో సంద్రం ముందుకు రావడం, వెనక్కు జరగడం సాధారణమే. మామూలు రోజుల్లో ఎప్పుడూ లేనివిధంగా జరగడంతో అందరూ ఆందోళన చెందారు. సుమారు పది నెలలనుంచి సంద్రంలో అనేక మార్పులు గమనిస్తున్నామని మత్స్యకారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com