చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకర్గం రామచంద్రపురం మండలం, రామాపురంలో జనసేన, బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులపై వైసిపి నాయకులు దాడులు చేశారని ఆరోపించారు. దాడికి పాల్పిడీన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జనసేన, బీజేపీ చంద్రగిరి నియోజకవర్గం నాయకులు రామచంద్రపురంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దేవర మనోహర గారు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు సంజీవ హరి గారు, ఉపాధ్యక్షులు కిరణ్ గారు, పవన్, ఢిల్లీ, వాసు, లోకేష్ మరియు బిజెపి మండల అధ్యక్షులు జనార్దన్ నాయుడు గారు ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి గారు మరియు ఇతర జనసేన మరియు బీజేపీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.