ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 12:31 PM

విజయనగరం జిల్లా: శృంగవరపుకోట సబ్ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం పక్కా ప్రణాళికతో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం. ఆదివారం శృంగవరపుకోట పట్టణం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించామని తెలిపారు.


ఈ దాడులలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు వ్యక్తులు నుండి సుమారు 400 కేజీల గంజాయిని గుర్తించామని తెలిపారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులు గోపి, సర్జిత్, రోషన్, షబ్బీర్, పార్వతి, రాజ్ కుమార్, పాల్ కుమార్ గా గుర్తించినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులు దుప్పట్లు వ్యాపారం చేస్తుంటారని తెలిపారు.


ఇదిలా ఉంటే ఆదివారం శృంగవరపుకోట పట్టణం స్థానిక దేవి కూడలి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి తూపాన్ నరేష్ గా గుర్తించినట్లు ఆయన తెలిపారు.


ఇదే క్రమంలో ఇదే రోజు మహారాష్ట్రకు చెందిన సతీష్ అనే వ్యక్తి అక్రమంగా 16 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మొత్తంగా మూడు కేసుల్లో 420 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సబ్ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు మాట్లాడుతూ. ఎవరైనా అక్రమంగా గంజాయిని తరలించినట్లైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com