విజయనగరం: సాలూరు పట్టణం స్థానిక వెంకటేశ్వర కాలనీకి చెందిన కొయ్యాన తిరుపతిరావు (30) తమ ఇంట్లో మెడపై గాయాలతో అనుమానాస్పదంగా మృతి చెందారు. సమాచారం అందుకున్న సాలూరు పట్టణ పోలీసులు శనివారం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే మృతుడు తిరుపతిరావు పట్టణంలో మాంసపు దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. తిరుపతిరావు మెడపై గాయాలతో తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.