ఏపీలో ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుంది. ఫిబ్రవరి 6 రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఉద్యోగుల పై ఎస్మా ప్రయోగించేందుకు రంగం సిద్దం చేసినట్టు సమాచారం. కీలక శాఖలు సమ్మెలోకి వెళ్తే పరిస్థితి చేజారుతుందని భావించి సర్కార్ అలర్ట్ అయ్యింది. ఏయే శాఖలపై ఎస్మా ప్రయోగించవచ్చనే దాని పై ప్రభుత్వ పెద్దలు సమాలోచన చేస్తున్నారు. ఆర్టీసి, విద్యుత్, ఆరోగ్యశాఖలు సమ్మెలోకి వెళ్తామనడంతో సర్కార్ అలర్ట్ అయ్యింది. త్వరలోనే ఎస్మా పై ప్రకటన చేసే అవకాశం ఉంది.