తూర్పగోదావరి జిల్లాలో భర్త తనను పదే పదే విసిగిస్తున్నాడని, గొడవపడుతున్నాడని భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. పోలీసుల కథనం మేరకు.. సీతానగరం మండలం రఘుదేవపురం యనాదుల కాలనీలో నివాసముంటున్న ముత్యాలమ్మ భర్త అబ్బులుని చంపేసింది. ఫిట్స్ వచ్చి చనిపోయాడని ఊళ్లో వాళ్లని నమ్మించి దహన సంస్కారాలు నిర్వహించడానికి మృతదేహాన్ని గుట్టుగా స్మశానానికి తరలించాలని చూసింది. నేరం, అబద్దాన్ని ఎక్కువ సేపు దాగవని తెలుసుకోలేకపోయింది ముత్యాలమ్మ. స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో భార్య కిరాతకం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముత్యాలమ్మను విచారించగా..అనారోగ్యంతో మృతి చెందాడని చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేశారు. చనిపోయిన అబ్బులు మద్యం తాగిన సమయంలో భార్య ముత్యాలమ్మతో గొడవపడేవాడు. ఆ చిరాకులోనే ముత్యాలమ్మ, ఆమె భర్త అబ్బులు ఇద్దరు కలిసి బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. భర్తతో బయటకు వెళ్లిన సమయంలో ముత్యాలమ్మ భర్త అబ్బులుని ముఖంపై కొట్టి అతని మర్మాంగం కట్ చేసి అత్యంత దారుణంగా హతమార్చింది.
ఏమీ తెలియనట్లుగా రాత్రికి ముత్యాలమ్మ ఒక్కతే ఇంటికి వచ్చింది. తెల్లవారు జామున అబ్బులు మృతదేహాన్ని రాపాక రోడ్డులోని కల్వర్టు దగ్గర గుర్తించిన స్థానికులు ముత్యాలమ్మకు విషయం తెలియపరిచారు. భర్తను చంపిన కిరాతకురాలు విషయాన్ని మూడో కంటికి తెలియకుండా ఉండేందుకు దహన సంస్కారాలు చేయడానికి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తుండగా పోలీసులకు విషయం తెలిసి వచ్చి పట్టుకున్నారు. అబ్బులు మృతిపై ముత్యాలమ్మను పోలీసులు నిలదీయగా ఫిట్స్ వచ్చి చనిపోయాడని పోలీసులకు అబద్ధం చెప్పింది. ముత్యాలమ్మ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని గ్రహించిన పోలీసులు డెడ్ బాడీని పరిశీలించడంతో అబ్బులు మర్మాంగం కట్ చేసి ఉన్నట్లుగా గుర్తించారు. ముఖంపై గాయాలు ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. ఆ తర్వాతే తానే ఆ హత్య చేశానని ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారిస్తున్నారు.