నెల్లూరు: కొడవలూరు మండలం చంద్రశేఖరపురం సమీపంలో శనివారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా శ్రీరామపురం ప్రాంతానికి చెందిన వాయిల బాబు మరో వ్యక్తి బైక్ పై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో వాయిల బాబు తీవ్రగాయాలై మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలు కాగా కొడవలూరు పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.