తూర్పు గోదావరి: ప్రేమించి, పెళ్లి చేసుకున్న వ్యక్తి మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని, అడిగితే కులం పేరుతో దూషిస్తున్నాడని ఓ మహిళ బొమ్మూరు పోలీసులకు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే హుకుంపేట జైహింద్ నగరకు చెందిన కె. గంగాధర్ ఓ యువతి(19) ప్రేమించి పెద్దలకు తెలియకుండా 2019లో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం మరో పెళ్లికి సిద్ధపడుతుండగా ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించాడని ఆ యువతి బొమ్మూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.