ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్సైజ్ (ఎఈబీ) పోలీసులపై సారా వ్యాపారులు దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 10:44 AM

 తూర్పుగోదావరి జిల్లా : తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జిల్లెలపేట వద్ద గోదావరి నదిలో పడవపై  సారా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో రాజోలు ఎస్ఈబి ఎస్ఐ రఘు, కానిస్టేబుళ్లు నానాజీ, వాసంశెట్టి శ్రీనివాసుడు దాడులు జరుపుతుండగా సారా వ్యాపారం చేస్తున్న ఆరుగురు రాజోలు ఎస్ఈబి (ఎక్సైజ్) పోలీసులపై ప్రతి దాడులు జరపడంతో ఎస్ఈబీ కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాసులుకు తీవ్ర గాయాలవడంతో అతనిని ఆలమూరు ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యంకు తరలించారు.  కాగా సంఘటన స్థలాన్ని అమలాపురం ఎస్ఈబీ అడిషనల్ ఎక్సైజ్ సూపరిండెంట్ (డీఎస్పీ) ఎస్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. విషయం తెలుసుకున్న ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ మండపేట రూరల్ సీఐ శివగణేష్ ఆసుపత్రికి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రుడు ఎస్ఈబి కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాసుడు నుండి వాంగ్మూలం తీసుకున్నారు.  దీనిపై శ్రీనివాసుడు ఇచ్చిన సమాచారంతో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై, సీఐ తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com