ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 28, 2022, 07:33 PM

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ వివరాలు ఇలా ఉన్నాయి.
-మొత్తం ఖాళీలు: 105
-విభాగాల వారీగా ఖాళీలు: కంప్యూటర్‌ సైన్స్‌-37, ఎలక్ట్రికల్‌-60, సివిల్‌-04, ఎలక్ట్రానిక్స్‌-04.
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్‌ సైన్స్/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌/ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తర్ణత. వాలిడ్‌ గేట్‌ 2021 స్కోర్‌ ఉండాలి.
-వయసు: 31.12.2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
-జీతభత్యాలు: ట్రెయినింగ్‌ పీరియడ్‌లో నెలకి రూ.40,000 + ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. విజయవంతంగా ఏడాది ట్రెయినింగ్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు (ఇంజినీర్‌ ఈ 2 స్కేల్‌) నెలకి రూ.50,000 నుంచి రూ.1,60,000 + ఇతర అలవెన్సులు అందజేస్తారు.
-ఎంపిక విధానం: గేట్‌ 2021 మెరిట్‌ స్కోర్‌, బిహేవియరల్‌ అసెస్‌మెంట్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
-దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2022.
-ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.02.2022.
-పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.powergrid.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com