తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల నుంచి డిమాండ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి మాసం ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటాను నేడు ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. 3. 36 లక్షల టిక్కెట్లను 45 నిమిషాలలోనే భక్తులు కొనుగోలు చేశారు. టిక్కెట్లు పూర్తి అయిన విషయం తెలియక వేలాదిగా టిక్కెట్ల కోసం వెబ్సైట్లో భక్తులు లాగిన్ అవుతున్నారు. నిమిషాలలోనే టిక్కెట్ల కోటా పూర్తవ్వడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.