ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 27, 2022, 08:42 PM

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఎన్టీఆర్ పేరు మీద జిల్లా ఏర్పాటు చేసినందుకు ఏపీ సీఎం జగన్‌కు ఎన్టీఆర్ అభిమానుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. జగన్ తన కంటే చిన్నవాడైనా, ఎన్టీఆర్ అభిమానిగా ఆయనకు పాదాభివందనం చేస్తున్నానన్నారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తానని 2018లో జగన్ వెల్లడించారని కొడాలి నాని అన్నారు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేకపోయిందని విమర్శించారు. సుపరిపాలన అందించడమే జగన్ ధ్యేయమని, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని కొడాలి నాని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com