ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 27, 2022, 07:00 PM

కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కౌతల మండలం కామవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన శివప్ప, ఈరన్నలపై బీజేపీకి చెందిన మల్లికార్జున, ఆయన వర్గీయులు దాడి చేసి.. వేటకొడవళ్లతో నరికి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శివప్ప, ఈరన్నకు.. మల్లికార్జునతో భూవివాదం ఉంది. వీరిలో శివప్ప వర్గం వైసీపీలో, మల్లికార్జున వర్గం బీజేపీలో కొనసాగుతోంది. భూతగాదా విషయం గురించి మాట్లాడేందుకు ఈ ఉదయం రెండు వర్గాలు వెళ్లిన సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలోనే శివప్ప, ఈరన్నలు దారుణ హత్యకు గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com