ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 27, 2022, 06:55 PM

ఏపీ లో 13 జిల్లాలను 13 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి అని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీలో 26 జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వాగతించారు. ఈరోజు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. జిల్లా ఏర్పాటులో రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేశారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి తమ చిరకాల స్వప్నమైన హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com