ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఆంధ్రా లో కొత్తగా 12,926 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 05:00 PM

ఆంధ్రా లో కరోనా తీవ్రత రోజు రోజు కు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి . తాజాగా గడిచిన 24 గంటల్లో 43,763 నమూనాలను పరీక్షించగా, 12,926 మందికి కరోనా ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. విశాఖపట్నం జిల్లాలో 1,959, చిత్తూరు జిల్లాలో 1,566, అనంతపురం జిల్లాలో 1,379, గుంటూరు జిల్లాలో 1,212, ప్రకాశం జిల్లాలో 1,001 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో, 3,913 మంది కరోనా నుండి కోలుకున్నారు మరియు ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో సహా కరోనా మరణాల సంఖ్య 14,538కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,66,194 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,78,513 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 73,143కి పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com