జగన్ ప్రభుత్వo పై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్య మంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రయత్నం చేశారన్నారు. కేరళలోని కూర్గ్లో కొండ జాతులపై టిప్పు సుల్తాన్ ఊచకోత కోశాడని పరిపూర్ణానంద అన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమైందన్నారు. PFI ప్రోత్సాహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించే ప్రయత్నం జరిగింది. తుగ్లక్ సుల్తాన్, తుగ్లక్ బాద్షాలు తయారవుతున్నారు... ప్రభుత్వాన్ని దింపుతామని తెలిపారు స్వామి,ఇంకా జగన్ జైలుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. హిందువులు అందరినీ కేసులు పెట్టి లోపల వేసినా సిద్ధంగా ఉండాలని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు.