ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను ట్రాన్సఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్గా హిమాన్షు కౌశిక్ నియమితులయ్యారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నిశాంత్కుమార్ను బదిలీ చేశారు. అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా కేతన్ గార్గ్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.